బ్రేకింగ్ : మరో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్..!

-

 

తెలంగాణలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకగా తాజాగా కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆయన భార్య సౌజన్య, కుమారుడు విధాత్‌లకు సైతం కోవిడ్‌ సోకినట్లు ఆదివారం వైద్యులు వెల్లడించారు. వైద్యుల సూచన మేరకు 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందుతానని, ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ మాస్క్‌ లు, శానిటైజర్లతో శుభ్రంగా ఉండాలని సూచించారు. కాగా, ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన హోంమంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, గణేష్ గుప్తా కరోనా బారినపడ్డారు.

ఇక కాంగ్రెస్ నేతలు వి.హనుమంతరావు, గూడూరు నారాయణరెడ్డి, బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డికి సైతం కరోనా సోకిన విషయం తెలిసిందే. ఐతే వీరిలో చాలా మంది ఇప్పటికే కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. తెలంగాణలో ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్న వేళ ప్రజా ప్రతినిధులు కూడా కొవిడ్ బారినపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news