FLASH : “రాధేశ్యామ్” పోస్ట్ పోన్ ? క్లారిటీ ఇచ్చిన మేకర్స్

-

ఇవాళ ఉదయం నుంచి టాలీవుడ్ సినిమాలు ఆర్ ఆర్ ఆర్, ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యాం సినిమాలో వాయిదా పడుతున్న అంటూ వార్తలు వచ్చాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో…. ఈ రెండు సినిమాలు సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న ఉన్నాయని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో ఈ సినిమాలు విడుదల చేస్తున్నట్లు రూమర్స్ కూడా వినిపించాయి.

అయితే తాజాగా “రాధేశ్యామ్” సినిమా విడుదల పై మేకర్స్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తాజాగా “రాధేశ్యామ్” సినిమా విడుదల తేదీని మరోసారి ప్రకటించింది చిత్ర బృందం. ఈ మేరకు ఓ పోస్టర్ కూడా విడుదల చేసింది రాధే శ్యామ్ టీం. ఈ పోస్టర్ లో జనవరి 14న సినిమా అంటూ స్పష్టం చేశారు “రాధేశ్యామ్” మూవీ మేకర్స్. కాగా పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమా లో  ప్ర‌భాస్, బ్యూటీఫుల్ హీరోయిన్ పూజా హెగ్డే హీరో హీరోయిన్స్ గా నటుస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news