ఉప ఎన్నికల్లో అబద్ధాలాడి గెలిచిన రఘునందన్ రావుకు ప్రజలు బుద్ధి చెప్పారు : హరీష్ రావు

-

లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇప్పటికే ఆయా పార్టీలు ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాయి.దుబ్బాక నియోజకవర్గంలోని దౌల్తాబాద్‌లో జరిగిన మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… దుబ్బాక ఉప ఎన్నికల్లో అబద్ధాలాడి గెలిచిన రఘునందన్ రావుకు మొన్నటి ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం నేర్పారు అని అన్నారు.

వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని బాండు రాసిచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతోంది. కాంగ్రెస్ ఉద్ధరించకుండా ఉద్దెర మాటలు మాట్లాడుతోంది అని మండిపడ్డారు.ఎన్నికల హామీలు అమలు కావాలంటే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించాలి. ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని నిలదీయాలంటే మాకు బలం ఇవ్వాలి అని విజ్ఞప్తి చేశారు.ప్రజల మనిషి, కలెక్టర్‌గా పనిచేసి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్న వెంకట్రామిరెడ్డిని గెలిపించుకోవాలి అని పిలుపునిచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Latest news