హరీష్ రావు వల్లే శ్రీకాంతాచారి బలైయ్యాడు : రఘునందన్ రావు

-

హరీష్ రావుపై రఘనందనరావు ఫైర్ అయ్యారు. డ్రామాలకు పర్యాయ పదం కేసీఆర్ కుటుంబమని.. సినీ నటుల కంటే గొప్పనటులు కేసీఆర్, హరీష్ రావులు అని నిప్పులు చెరిగారు. హరీష్ రావు డ్రామాలకు శ్రీకాంతాచారి బలైయ్యాడని.. పెట్రోల్ కొనుకున్న హరీష్ రావు 50పైసల అగ్గిపెట్టె మర్చిపోవటం డ్రామాలో భాగం కాదా? అని ప్రశ్నించారు. హరీష్ రావుది డ్రామా అని తెలియకనే శ్రీకాంతాచారి ప్రెట్రోల్ పోసుకుని కాల్చుకున్నాడని ఆరోపణలు చేశారు.

ఉద్యమంలో పాడి కౌషిక్ రెడ్డిది కీలకపాత్రగా కేసీఆర్ భావించిన ట్లున్నారని..మానవత్వం మరచి వ్యక్తిగత విమర్శలు చేయడం హరీష్ రావుకే చెల్లుతుందన్నారు. ఈటల కాలు ఆపరేషన్ పై దిగజారి మాట్లాడటాన్ని హరీష్ రావు విజ్ఞతకే వదిలేస్తామని చురకలు అంటించారు. నిరాహారదీక్ష ముసుగులో కేసీఆర్ ఖమ్మం ఆసుపత్రిలో జ్యూస్ తాగింది నిజం కాదా? వేరే పార్టీలో ఉంటే కష్టమని ఖమ్మంలో జ్యాస్ ఇచ్చిన డాక్టర్ కు గులాబీ కండువా కప్పలేదా? అని ప్రశ్నించారు. 2008లో రాజశేఖరరెడ్డిని కలసి కాంగ్రెస్ లో చేరటానికి సిద్ధమైన హరీష్ రావుతో చెప్పించుకునే స్థితిలో మేము లేమన్నారు. పెద్ద సామాజిక వర్గంగా ఉన్న మాదిగలకు క్యాబినెట్ లో చోటు కల్పించాలని.. రేవంత్ రెడ్డికి పీసీసీ ..కేసీఆర్ ఇప్పించారా? లేదా అనేది కాలమే సమాధానం చెప్తోందన్నారు. పార్లమెంట్ సమావేశాలు, కిషన్ రెడ్డి యాత్ర కారణంగానే బండి‌ సంజయ్ పాదయాత్ర వాయిదా పడిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news