కేసీఆర్‌ షాక్‌…ఎల్లో మీడియా అధినేతలతో రాహుల్‌ గాంధీ చర్చలు !

-

నిన్న కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా… నిన్న వరంగల్‌ సభలో పాల్గొన్నారు రాహుల్‌ గాంధీ. ఈ సందర్భంగా రైతు డిక్లరేషన్‌ ను కూడా ప్రకటించారు రాహుల్‌ గాంధీ. ఇక ఇవాళ ఎల్లో మీడియా అధినేతలతో కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ సమావేశం అయ్యారు.

తాజ్ కృష్ణ హోటల్ లో *రాహూల్ గాంధీతో ABN రాధాకృష్ణ,CVR చైర్మన్ సి.వి.రావు,TV 5 చైర్మన్ బి ఆర్ నాయుడు, రవిప్రకాష్* సమావేశమయ్యారు. అలాగే… హైదరాబాదులో రాహుల్ గాంధీని కలిసిన 30 నిమిషాలు తాజా రాజకీయాలపై చర్చలు జరిపారు రవి ప్రకాష్. అంతేకాదు.. రవి ప్రకాష్ ను ఢిల్లీలో తన ఇంటికి ప్రత్యేకంగా ఆహ్వానించారు రాహుల్ గాంధీ. ఇక వీరితో మీటింగ్‌ అనంతరం… చంచల్‌గూడ జైలుకు చేరుకున్న రాహుల్‌ గాంధీ, జైల్లో ఎన్‌ఎస్‌యూఐ నేతలతో రాహుల్‌ ములాఖత్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news