రైతులకు శుభవార్త..ఈ నెల 15 నుంచే రైతు బంధు నిధులు !

-

ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగనుంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు సీఎం శ్రీ కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరుగనున్నది. ఈ సమావేశంలో ధాన్యం కొనుగోల్లు, రైతుబంధు నిధుల విడుదల, సొంత జాగలు ఉన్న బలహీన వర్గాలకు గృహ నిర్మాణం అంశం, దళిత బంధు అమలు, తదితర అంశాలపై క్యాబినెట్ చర్చించే అవకాశం ఉన్నది.

అలాగే ముందస్తు ఎన్నికలపై కూడా సీఎం కెసిఆర్ చర్చించే అవకాశం ఉందంటూ తెలుస్తోంది. ముఖ్యంగా రైతుబంధు నిధులపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. డిసెంబర్ 15వ తేదీ నుంచి రైతుబంధు నిధులను రైతుల ఖాతాలో వేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇవాళ కేబినెట్ సమావేశంలో సీఎం కేసీఆర్ చర్చించనున్నారు.

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news