జీవిత దర్శకత్వంలో మే 20 న వస్తున్న రాజ “శేఖర్”

-

జీవిత దర్శకత్వం లో ప్రముఖ నటుడు రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన చిత్రం” శేఖర్” ఇటీవల విభిన్న తరహా కథాంశాలను ఎంచుకుంటూ, సెలక్టివ్ గా చిత్రాలు చేస్తున్న రాజశేఖర్ మరోసారి విలక్షణమైన లుక్ లో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.ఈ చిత్రం మే 20న విడుదలకానుంది.ఈ సినిమాకు రాజశేఖర్ అర్ధాంగి జీవిత దర్శకత్వం వహించడం విశేషం.

ఈ సినిమా నిర్మాణంలో రాజశేఖర్ కుమార్తెలు శివాని, శివాత్మిక కూడా భాగస్వాములు కావడం విశేషం. బీరం సుధాకర్ రెడ్డి, బుగ్గారం వెంకట శ్రీనివాస్ నిర్మాతలు.ఈ చిత్రంలో ఆత్మీయ రాజన్, కన్నడ కిషోర్, ముస్కాన్, భరణి,రవిశర్మ , సమీర్ కీలక పాత్రలు పోషించారు.ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.కాగా శేఖర్ చిత్రాన్ని సంక్రాంతి సీజన్ లోనే రిలీజ్ చేయాలని భావించినా..ఆ నిర్ణయం కార్యరూపం దాల్చలేదు.ఇన్నాళ్లకు రిలీజ్ డేట్ ను చిత్ర బృందం ప్రకటించింది.రాజశేఖర్ తన కెరీర్లో 91వ చిత్రం” వాడు ఎప్పుడైనా మనం చెప్పింది చేశాడా” అంటూ సాగే కొన్ని డైలాగులు” శేఖర్” పాత్ర స్వభావాన్ని వివరిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news