పోలీసులపై వ్యాఖ్యలు: టీడీపీ నేత అయ్యన్న పాత్రుడిపై కేసు నమోదు

-

అనకాపల్లి జిల్లా:- మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్నపా త్రుడుపై మరో కేసు నమోదు అయింది. విశాఖ పట్నం జిల్లా నర్సీ పట్నం మరిడి మాంబ ఉత్సవాల సందర్భంగా పోలీసులను ఉద్దేశించిన ఆయన చేసిన వ్యాఖ్యలను పోలీసులు తీవ్రంగా ఖండించారు. ఆయన పై కేసు నమోదు చేశారు పోలీసులు. 353 తో పాటు మరి కొన్ని సెక్షన్ల కింద మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్నపా త్రుడుపై కేసు నమోదు చేశారు.

నర్సీ పట్నం గ్రామ దేవత మరిడి మాండ పండుగను నిర్వహించడానికి ఎఎస్పీ అనుమతులు ఇవ్వడం లేదని మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్నపా త్రుడు ఆరోపించిన సంగతి తెలిసిందే. రికార్డింగ్‌ డాన్సులను నిర్వహించినా.. వాహనాల రాకపోకలకు ఆటంకాన్ని కలిగించినా.. చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలియజేసినట్లు ఆయ్యన్న పేర్కొన్నారు. వివిధ కారణాలతో అనుమతులు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని చెప్పారు. ఉత్సవాల కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. స్పందించలేదని విమర్శలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news