2వేల కోట్లు ఇస్తే…రాజీనామా చేస్తా : రాజాసింగ్ సవాల్

-

బండి సంజయ్‌ నిర్వహించే పాదయాత్ర పేరు కాసేపటి క్రితమే… బీజేపీ శాసనసభపక్ష నేత రాజసింగ్ ప్రకటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…  కేసీఆర్ కుటుంబం తెలంగాణ ప్రజల రక్తం తాగుతోందని..ప్రజా సంగ్రామ యాత్రగా బండి సంజయ్ పాదయాత్ర సాగనుందని తెలిపారు. గోషామహాల్ అభివృద్ధికి 2వేల కోట్లు ఇస్తే ఎమ్మేల్యే పదవికి రాజీనామా చేయటానికి సిద్ధమని మరోసారి సవాల్‌ విసిరారు. హుజురాబాద్ లో కేసీఆర్ డబ్బు గెలుస్తుందో.. ఈటల గెలుస్తాడో ప్రజలే నిర్ణయిస్తారన్నారు.

2023 లో అధికారమే లక్ష్యంగా బండి సంజయ్ పాదయాత్ర సాగనుందని.. పాదయాత్రలో కేంద్రమంత్రులు సైతం పాల్గొంటారని తెలిపారు. తెలంగాణను అడ్డుకున్న ఓవైసీ చేతిలో కేసీఆర్ కారు స్టీరింగ్ పెట్టాడని..సంతలో పశువులు, కుక్కలను కొన్నట్లు ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్ కొంటున్నాడని మండిపడ్డారు. టీఆర్ఎస్ ఎన్నికల హామీలు అమలు చేసే వరకు సంజయ్ నాయకత్వంలో పోరాటం చేస్తామని…ధనిక రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణ మార్చిన విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి నిధులు రావటంలేదని కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా నిసిగ్గుగా అబద్దాలు చెప్తున్నారని నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Latest news