సీఎం కేసీఆర్ పోటీ చేసినా.. నేనే గెలుస్తా – కోమటిరెడ్డి రాజగోపాల్

-

మునుగోడు ఉప ఎన్నికలో సీఎం కేసీఆర్ పోటీ చేసిన విజయం తనదేనని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ కు దమ్ము, ధైర్యం ఉంటే ఉపఎన్నికలో పోటీ చేయాలని సవాల్ విసిరారు. కేసీఆర్ నియంత పాలనను అంతమొందించేందుకు తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బిజెపిలో చేరానన్నారు. శనివారం మునుగోడులో నిర్వహించిన బిజెపి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.

మునుగోడు ప్రజల చేతిలో నేను ఒక ఆయుధమని, ఈ ఆయుధంతో కేసీఆర్ ని అంతమొందించాల్సిన అవసరం ఉందని, విజయం మనదే. కానీ, మెజార్టీ ఎంతో మీరు చెప్పాలి అంటూ రాజగోపాల్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక్కడ గెలిచేది రాజగోపాల్ రెడ్డి కాదు మునుగోడు ప్రజలు అని రాజగోపాల్‌ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేగా ఉండి ఏమి చేయ లేకపోయానని, మునుగోడు ప్రజల అభివృద్ధి కోసమే తాను పదవికి రాజీనామా చేశానని మరోసారి స్పష్టం చేశారు రాజగోపాల్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news