మునుగోడులో బీజేపీ గెలిస్తే..నెల రోజుల్లో కేసీఆర్‌ సర్కార్‌ కూలుతుంది – రాజగోపాల్‌ రెడ్డి

-

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి…టీఆర్‌ఎస్‌ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో బీజేపీ గెలిస్తే, నెల రోజుల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుందని పేర్కొన్నారు రాజగోపాల్‌ రెడ్డి.

యావత్ దేశం మునుగోడు వైపే చూస్తుందని… టిఆర్ఎస్ పార్టీ లో చేరితెనే ఎమ్మెల్యే లకు కేసీఅర్ అపాయిట్మెంట్ ఇస్తాడని పేర్కొన్నారు. నా ప్రాణం ఉన్నంత వరకు మునుగోడును వదిలిపెట్టబోనని స్పష్టం చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

టిఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు వారి నియోజక వర్గ సమస్యల గురించి కేసీఆర్ ను అడిగే దమ్ముందా ? అని సవాల్‌ చేశారు. ఇంటికి కిలో బంగారం ఇచ్చిన టిఆర్ఎస్ కు ప్రజలు ఓటెయ్యరని.. మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పు చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news