డబుల్ ఇంజిన్లకు ట్రబుల్ ఇస్తున్న తెలంగాణ ఫించన్లు – మంత్రి జగదీష్ రెడ్డి

-

సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండల కేంద్రంలో నూతన పెన్షన్లు పంపిణీ చేశారు తెలంగాణ విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర జనాభాలో 60% కుటుంబాలకు ఆసరా ఫించన్లు ఇస్తున్నామని.. మోడీ సొంత రాష్ట్రంలో ఫించన్లు పొందుతున్నది 20 శాతం కుటుంబాలేనని వెల్లడించారు.

మోడీ సొంత రాష్ట్రంలో ఆసరా ఫించన్ 750 రూపాయలేనని చురకలు అంటించారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో ఇచ్చేది 600 రూపాయలేనని చెప్పారు తెలంగాణ విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. డబుల్ ఇంజిన్లకు ట్రబుల్ ఇస్తున్న తెలంగాణా ఫించన్లు ఇస్తున్నామని చెప్పారు. ప్రజలు తిరగబడతారన్న భయం బిజెపిని వెంటాడుతుందని… అందుకే కేంద్రం నుండి రావాల్సిన నిధులకు అడ్డుపుల్లలు, రుణాలు రాకుండా మోకాలు అడ్డుతున్నారన్నారు మంత్రి జగదీష్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news