తెలంగాణలో గన్ కల్చర్ వచ్చింది..క్రైమ్‌ కంట్రోల్‌ తప్పింది – రాజా సింగ్

-

తెలంగాణలో గన్ కల్చర్ వచ్చింది..క్రైమ్‌ కంట్రోల్‌ తప్పిందని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. ఇద్దరు రౌడీషీటర్ల మధ్య తలెత్తిన గొడవ కారణంగా కాల్పులు జరిగాయి. దీంతో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయాలపాలయ్యారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని మాధాపూర్‌ ఠాణా సమీపంలోని నీరూస్‌ కూడలి వద్ద ఈ ఘటన జరిగింది.

ఈ సంఘటన పై రాజాసింగ్‌ స్పందిస్తూ.. నిన్న రాత్రి కాల్పులు జరిగాయి… ఒక వ్యక్తి చనిపోయారు..క్రైమ్ ఎక్కడ కంట్రోల్ అయిందని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ లో గన్ కల్చర్ వచ్చింది.. కార్డన్ సెర్చ్ పాత బస్తీ లో ఎందుకు బందు అయిందని ఆగ్రహించారు. హోమ్ మినిస్టర్ డమ్మీ నా, రబ్బర్ స్టాంప్ అని.. శాంతి భద్రతలు కాపాడడం పై విఫలమయ్యారని విమర్శలు చేశారు రాజాసింగ్‌. తెలంగాణ లో వచ్చేది బీజేపీ సర్కార్‌ అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news