టైలర్ కన్హయ్య లాల్ కుమారులకు రాజస్థాన్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలు

-

రాజస్థాన్ లోని ఉదయపూర్ లో దుండగుల చేతిలో దారుణ హత్యకు గురయిన కన్హయ్య లాల్ కుమారులకు రాజస్థాన్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు గా ప్రకటించింది. కన్నయ్య లాల్ తేలి కుమారులైన యశ్ తేలి, తరుణ్ తేలీలను ప్రభుత్వ ఉద్యోగంలో నియమిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ మంత్రి మమతా భూపేష్ మీడియాకు తెలిపారు.

రాజస్థాన్ సబార్డినేట్ ఆఫీసర్ క్లర్క్ సర్వీస్ రూల్స్ 2008, 2009 లోని రూల్స్ 6 సి ప్రకారం ఈ నియామకాలు జరుగుతున్నట్లుగా ఆమె తెలిపారు. కన్హయ్య లాల్ సంపాదన పైనే ఆయన కుటుంబం ఆధారపడి ఉండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా మహమ్మద్ ప్రవక్త పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మకు తన మద్దతు పలకడంతో ఈ ఇద్దరు వ్యక్తులు అతనిని హత్య చేశారు. దేశవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news