రాజస్థాన్ లో దారుణం… మైనర్ పై రెండేళ్లుగా అత్యాచారం, అందుకు నిరాకరించడంతో స్నేహితులతో గ్యాంగ్ రేప్

-

రాజస్థాన్ లో దారుణం జరిగింది. చురు జిల్లా రతన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై గత రెండేళ్లుగా ఓ కామాంధులుడు అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఇటీవలం తన మిత్రులతో కలిసి బాలికను తీవ్రంగా హింసించి మిత్రులతో కలిసి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డాడు. పోలీసులు ఈ ఘటనపై ఫిర్యాదు నమోదు చేసుకుని, విచారణ చేపట్టారు. బాలికను తీవ్రగాయాలు పాలు చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు నిందితులు. ముఖంగా, శరీరంపై తీవ్ర గాయాలు అయినట్లు పోలీసులు వెల్లడించారు. ఇద్దరిపై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. 

పూర్తి వివరాాల్లోకి వెళితే బాధిత బాలిక పదో తరగతి చదువుతోంది. బాలిక ఇంటి పక్కనే ఉండే కిషోర్ అనే వ్యక్తి తనతో స్నేహం చేయాలని బాలికపై ఒత్తడి తీసుకువచ్చాడు. రెండేళ్ల నుంచి బాలికపై ఒత్తడి తీసుకువస్తున్నాడు. స్నేహానికి బాలిక ఒప్పుకోలేదు. అయితే ఓ సారి పొలం దగ్గరకు రావాలని కిషోర్ కోరగా.. అక్కడికి వెళ్లిన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనను వీడియో తీసి వైరల్ చేస్తా అని బెదిరించాడు. ఆ తరువాత రెండేళ్లుగా సదరు బాలికపై రోజూ అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల మరోసారి పొలం దగ్గరకు బాలికను పిలిచాడు. అక్కడకు కిషోర్ తన మిత్రులతో వచ్చారు. అందులో ఒకరితో సంబంధం పెట్టుకోవాలని కోరగా… బాలిక తిరస్కరించింది. దీంతో కిషోర్ బాలికను తీవ్రంగా గాయపరిచి… సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలైన బాలికను అక్కడే వదిలి నిందితులు పారిపోయారు. తీవ్రంగా గాయాలపాలైన బాలిక స్పృహ కోల్పోయింది. మెలుకవలోకి వచ్చిన తర్వాత జరిగిన ఘటనను ఇంట్లో చెప్పిందిని పోలీసులు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news