వైసీపీ గెలిస్తేనే ఏపీలో సంక్షేమ పథకాలు !

-

యువ‌త‌కు బంగారు భ‌విష్య‌త్తు అందించేందుకు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి గారు గ‌త ఐదేళ్లుగా ఎంతో కృషి చేశార‌ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ గుంటూరు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ అభ్య‌ర్థి శ్రీమతి విడ‌ద‌ల ర‌జిని గారు తెలిపారు. వైసీపీ అధికారంలోకి వస్తేనే మళ్లీ సంక్షేమ పథకాలు అమలు అవుతాయని ఆమె వెల్లడించారు. స్థానిక శ్యామ‌లాన‌గ‌ర్‌లోని మంత్రి నివాసంతోపాటు, ప‌ర్య‌ట‌నల్లో ప‌లు చోట్ల టీడీపీ, జ‌న‌సేన ల నుంచి భారీగా యువ‌త వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీలో చేరారు. వీరంద‌రికీ పార్టీ కండువాలు క‌ప్పి మంత్రి విడ‌ద‌ల ర‌జిని సాద‌రంగా వైసీపీలోకి ఆహ్వానించారు.

శ్రీనివాస‌రావుపేట నుంచి 22వ డివిజ‌న్ అధ్య‌క్షుడు జాని బాష ఆధ్వ‌ర్యంలో 50 మందికిపైగా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ లో చేరారు. మంత్రి నివాసంలో ఈ చేరిక‌లు జ‌రిగాయి. టీడీపీ నుంచి ఈ చేరిక‌లు జ‌రిగాయి. షాబుల్‌, తాహెదుల్లా, హుస్సేన్‌, షోడాల మ‌స్తాన్‌, క‌డ‌ప భాష‌, షేక్ హుస్సేన్ పీరా, స‌య్య‌ద్ అజీజ్‌, కొండ‌ల్‌రావు, శ్రీనివాస్‌, షేక్ అక్బ‌రి, షేక్ నాగూర్‌వ‌లి, షేక్ స‌య్య‌ద్‌ఖాన్‌, శిలార్‌, హాస‌న్‌, సూరిబాబు, మ‌స్తాన్‌వ‌లి త‌దిత‌రులు పార్టీలో చేరిన‌వారిలో ఉన్నారు

Read more RELATED
Recommended to you

Latest news