కేబుల్ బ్రిడ్జి ప్రమాదం.. బీజేపీ ఎంపీ కుటుంబంలో 12 మంది మృతి

-

గుజరాత్‌లోని మోర్బి జిల్లాలో జరిగిన కేబుల్‌ బ్రిడ్జి ప్రమాదంలో 132మంది దుర్మరణం చెందారు. మరి కొందరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరి కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపిన ఈ ఘటన రాజ్‌కోట్‌ ఎంపీ ఇంట్లో 12 మందిని బలి తీసుకుంది.

ఈ ప్రమాదంలో రాజ్‌కోట్‌ బీజేపీ ఎంపీ మోహన్‌భాయ్‌ కళ్యాణ్‌జీ కుందరియా కుటుంబానికి చెందిన 12 మంది మృతి చెందారు. వారంతా తన సోదరి కుటుంబానికి చెందినవారని కుందరియా తెలిపారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నారని చెప్పారు. మచ్చు నదిపై ఉన్న కేబుల్‌ బ్రిడ్జి ఆదివారం సాయంత్రం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు 132 మంది మరణించగా, 117 మంది సురక్షితంగా బయటపడ్డారు. మరో 19 మంది గాయపడ్డారు. మిగిలిన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news