వెబ్ సిరీస్ లలో నటించడానికి నేను రెడీ… రకుల్ ప్రీత్ సింగ్..!

-

హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్, సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పలకరించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో పాటు రకుల్ ప్రీత్ సింగ్ నటనకు, అందచందాలకు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి స్పందన రావడంతో టాలీవుడ్ లో ఈ హాట్ బ్యూటీ కి క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి.

అందులో భాగంగా అనేక తెలుగు సినిమాలలో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది. రకుల్ ప్రీత్ సింగ్ కేవలం తెలుగు భాష సినిమాల్లో మాత్రమే కాకుండా ఇతర భాష సినిమాల్లో కూడా నటించి అక్కడ కూడా మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మాత్రం రకుల్ తన ఇంట్రెస్ట్ ను ఎక్కువగా బాలీవుడ్ ఇండస్ట్రీ పైనే పెట్టింది.

ఇది ఇలా ఉంటే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ ఓటిటి ప్లాట్ ఫామ్ ల గురించి మాట్లాడింది.. ఆసక్తిగా సాగే వినోదాత్మక కథలకు వ్యూయర్స్‌ నుంచి ఎప్పుడూ మంచి స్పందన లబిస్తూ ఉంటుంది. ఇలాంటి కథలకు ఓటిటి ప్లాట్ ఫామ్ ల వల్ల మరింత ఆదరణ పెరిగింది అని రకుల్ ప్రీత్ సింగ్ తెలియజేసింది.

కొంతకాలం క్రితం ప్రాంతీయ మూవీ ల రిలీజ్‌లు, ప్రేక్షకుల ఆదరణ కొంత వరకే పరిమితం అయ్యేవి. కానీ ఇప్పుడు ఓటిటి ప్లాట్ ఫామ్ ల వల్ల మంచి ప్రాంతీయ మూవీ లను ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా వ్యూయర్స్‌ చూసే అవకాశం కలుగుతోంది. మంచి సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తోంది. అలాగే పాన్‌ ఇండియన్‌ మూవీ బిజినెస్‌ విషయంలో ‘బాహుబలి’ కొత్త దారులను చూపించింది. ఇప్పుడు సినిమాలకు భాషాపరమైన హద్దులు జరిగిపోయాయి.

సినిమాలో మంచి కంటెంట్ ఉంటే ఆ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌లో షో లేదా వెబ్‌ సిరీస్‌ లలో నటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ కథ నన్ను ఎగ్జైట్‌ చేసే విధంగా ఉండటంతో పాటు, ఆ సినిమా కథ నా పాత్ర ఆధారంగా నడిచే విధంగా ఉండాలి అని రకుల్ ప్రీత్ సింగ్ తెలియజేసింది.

Read more RELATED
Recommended to you

Latest news