‘ఆచార్య’ లో పాత్రపై చరణ్ క్లారిటీ.. మురిసిపోతున్న అభిమానులు..?

-

మెగాస్టార్ చిరంజీవి హీరోగా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా సక్సెస్ఫుల్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాపై మెగా అభిమానుల్లో రోజురోజుకు అంచనాలు పెరిగి పోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఎంతో కీలకం గా ఉండే అతిథి పాత్ర విషయమై గత కొన్ని రోజులుగా చర్చ నడుస్తోంది. ఈ అతిథి పాత్రలో ముందుగా మహేష్ బాబు నటించబోతున్నారు అనే టాక్ టాలీవుడ్ టౌన్ లో షికారు చేసింది. ఇక ఆ తర్వాత మహేష్ కాదు రామ్ చరణ్ రంగంలోకి దిగబోతున్నారు అంటూ టాక్ వినిపించింది.

కానీ ఎట్టకేలకు ఆచార్య సినిమాలో అతిథి పాత్రను ఎవరు చేయబోతున్నారు అనే దానిపై క్లారిటీ వచ్చింది. ఈ అతిథి పాత్ర చేసేది ఎవరో కాదు మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్. ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో… ఆచార్యు లో 30 నిమిషాల నిడివిగల అతిథి పాత్ర చేస్తున్నాను అంటూ రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. అయితే ఈ సినిమాతో నన్ను నాన్నని ఒకే తెరపై చూడాలనుకున్న తన తల్లి కూడా నెరవేర బోతుంది అంటూ చెప్పుకొచ్చారు రామ్ చరణ్.

Read more RELATED
Recommended to you

Latest news