రాజమౌళికి కరోనా… `బాహుబలి`ని పిలవమన్న వర్మ..!

-

లాక్ డౌన్ సడలింపుల అనంతరం సినీ వర్గాల్లో కూడా కరోనా కలవరం మొదలైంది. ఇప్పటికే చాలా మంది దీని బారిన పడ్డారు. తాజాగా దర్శకధీరుడు రాజమౌళికి కూడా కరోనా సోకినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకిందని తెలిపారు. అయితే ప్రస్తుతం ఎలాంటి లక్షణాలు లేవని.. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.

కాగా, రాజమౌళి చేసిన ట్వీట్ పై దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. `రాజమౌళి సర్.. మీ సైనికుడు `బాహుబలి`ని పిలిచి కరోనాను ఓ తన్ను తన్నమనండి. జోక్స్ పక్కన పెడితే.. మీరు, మీ కుటుంబ సభ్యులు అతి త్వరలోనే దీని నుంచి కోలుకుంటార`ని వర్మ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news