రమేష్ బాబు అంత్యక్రియల పై ఘట్టమనేని ఫ్యామిలీ కీలక సూచన..!

-

టాలీవుడ్ నటుడు ఘట్టమనేని రమేష్ బాబు నిన్న అనారోగ్యం తో మరణించారు. రమేష్ బాబు కొద్దిరోజులుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. అయితే నిన్న ఒక్క సారిగా తీవ్ర అస్వస్థతకు గురవడంతో హైదరాబాద్ లోని ఏఐజి ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మరణించినట్టు డాక్టర్లు నిర్ధారించారు. రమేష్ బాబు 15 కు పైగా చిత్రాల్లో నటించారు.

ఆ తరవాత సినిమా లకు దూరంగా ఉన్నారు. ఇక మహేష్ బాబు ఆయన ను ఎంతో గౌరవించేవారు. రమేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా తన రోల్ మోడల్ తన అన్న అని చెప్పారు.ఇదిలా ఉండగా నేడు రమేష్ బాబు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఘట్టమనేని ఫ్యామిలీ కీలక సూచన చేసింది. కరోనా కారణంగా అంత్యక్రియలకు వచ్చే వాళ్ళు కోవిడ్ నిబంధనలు పాటించాలని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news