పార్టీ మార్పు ప్రచారం వేళ.. ఎంపీ రంజీత్ రెడ్డి సంచలన ట్వీట్..!

-

బీఆర్ఎస్ పార్టీలో చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఆయన చేసిన ట్వీట్ గులాబీ పార్టీలో దుమారం రేపుతున్నయి. త్వరలోనే ఆయన బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారనే ప్రచారం జరుగుతున్న వేళ రంజిత్ రెడ్డి “పోరాడితే పోయేదేం లేదు” అంటూ ట్విట్టర్ వేదికగా గురువారం చేసిన పోస్ట్ సొంత పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.

‘పోరాడితే పోయేదేం లేదని ప్రముఖ తత్త్వవేత్త కార్ల్ మార్క్స్ ఏనాడో మనకు చెప్పాడు. ఈ రోజు ఆ మహనీయుడి వర్ధంతి. ఆయన స్ఫూర్తిని కొనసాగించడమే మనం ఆయనకిచ్చే నిజనమైన నివాళి’. అంటూ రంజిత్ రెడ్డి రాసుకొచ్చాడు. చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ పేరును కేసీఆర్ ప్రకటించిన మరుసటి రోజే రంజిత్ రెడ్డి ఈజ చేయడం అందులో పోరాటానికి సంబంధించిన లైన్ మెన్షన్ చేయడం చర్చగా ట్వీట్ మారింది.

Read more RELATED
Recommended to you

Latest news