హైద‌రాబాద్ లో దారుణం..మ‌హిళ‌పై ముగ్గురు అత్యాచారం..ఆపై..!

-

హైద‌రాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ మ‌హిళ త‌నపై ముగ్గురు అత్యాచారం చేశారంటూ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోట బజార్ కు చెందిన ఓ మహిళ తనపై నెల రోజుల‌ క్రితం ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేసి, ఫొటోలు వీడియోలు తీసినట్లు ఫిర్యాదు చేసింది. కొనేందుకు ఇల్లు చూపిస్తామని తనను తీసుకుని వెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సదరు మహిళ ఫిర్యాదు చేసింది.woman was tortured and molested while her father was killed

ఈ విషయాన్ని పోలీసులకు చెప్తే తనను చంపేస్తామని గన్నులు మరియు కత్తులు చూపించి బెదిరిస్తున్నట్లు మహిళ ఫిర్యాదులో పేర్కొంది. ఇక మ‌హిళ ఫిర్యాదు మేర‌కు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఓ నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నింధితులు పరారీలో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే హైద‌రాబాద్ న‌గ‌రంలో వ‌రుస దారుణాలు చోటు చేసుకోవ‌డం ప్ర‌జ‌ల‌ను ఆందోళ‌న‌కు గురిచేస్తోంది. కఠిన శిక్ష‌లు విధిస్తున్నా దారుణాలు చోటు చేసుకోవ‌డం పోలీసులకు త‌ల‌నొప్పిగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news