గ‌దిలో లాక్ అయిన హాట్ యాంక‌ర్ రేష్మీ గౌత‌మ్ !

-

అటు బుల్లి తెర‌…ఇటు వెండి తెర‌ను దున్నేస్తోన్న సంగ‌తి తెలిసిందే. వ‌చ్చిన ఏ అవ‌కాశాన్ని వ‌దల‌డం లేదు. డ‌బ్బులోస్తే ఎలాంటి పాత్ర అయినా చేయ‌డానికి సిద్ద‌మ‌ని బాహాటంగా చెప్పి మ‌రీ క‌మిట్ మెంట్లు ఇస్తోంది. దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టాలి అన్న లాజిక్ ను ప‌క్కాగా అమ‌లు చేస్తోంది. తాజాగా అమ్మ‌డు రాజుగారి గ‌దిలో లాక్ అయిన‌ట్లు తెలిసింది. ప్ర‌స్తుతం ఓంకార్ రాజుగారి గ‌ది-2కి కొన‌సాగింపు గా పార్ట్ -3ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా త‌మ‌న్నాను తీసుకుని త‌ర్వాత ఆమె అనివార్య కార‌ణాల వ‌ల్ల త‌ప్పుకోవ‌డంతో ఆ స్థానంలో సొట్టుబుగ్గ‌ల తాప్సీని తీసుకున్నాడు. ఇంకా సినిమాలో హీరోయిన్లే న‌టించాల్సిన కొన్ని ముఖ్య‌మైన పాత్ర‌లు ఉన్నాయ‌ట‌.

Anchor Rashmi Gautam Join in Raju Gari Gadhi 3 Movie

ఈ నేప‌త్యంలో ఖాళీగా ఉన్న కాజ‌ల్ అగ‌ర్వాల్ ను ఓ పాత్ర‌కు తీసుకోవాల‌నుకుంటున్నాడు. దీనిలో భాగంగా ఇప్ప‌టికే ఆమెతో సంప్ర‌దింపులు జ‌రిపాడుట‌. ఆమె నిర్ణ‌యం కోసం వెయిట్ చేస్తున్న‌ట్లు తెలిసింది. ఇక మ‌రో పాత్ర‌లో యాంక‌ర‌మ్మ రేష్మీ గౌత‌మ్ ను తీసుకున్న‌ట్లు స‌మాచారం. కీల‌క పాత్ర అని అంటున్నారు. అయితే ర‌ష్మీని తీసుకోవడానికి ఓ ప‌త్ర్యేక కార‌ణంగా కూడా ఉంద‌ని వినిపిస్తోంది. తొలి రెండు భాగాలుగా కాకుండా ఇందులో గ్లామ‌ర‌సం పండిచ‌నున్నాడుట‌. అందుకే ఏరికోరిమ‌రి రష్మీని తీసుకున్నాడ‌ని స‌మాచారం. హీరోయిన్ల‌కు గ్లామ‌ర్ పాత్ర‌లు కొత్తేంకాదు కాబ‌ట్టి ఆ విష‌యంలో యాంక‌ర్ ను ఎలివేట్ చేస్తేనే సినిమాకు ఎక్కువ‌గా క‌లిసొస్తుంద‌ని ఆమెను తీసుకున్న్ట‌ట్లు తెలుస్తోంది.

గ‌తంలో `గుంటూరు టాకీస్` లో ర‌ష్మీ చెల‌రేగిపోయిన సంగ‌తి తెలిసిందే. సినిమాకు ఆమె గ్లామ‌రే పిల్ల‌ర్ పాత్ర పోషించింది. అందుకే ర‌ష్మీని తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. వాస్త‌వానికి త‌మన్నాతో ఇలాంటి స‌న్నివేశాలు చేయించాల‌ని చూసాడు. కానీ అమ్మ‌డు మినిమం రేంజ్ సినిమా కావ‌డం..పైగా స్టార్లు ఎవ్వ‌రూ లేక‌పోవ‌డంతో? అందుకు స‌సేమీరా అంది. ఆ విష‌యంలో ఓంకార్ తో వివాదం త‌లెత్తి బ‌య‌ట‌కు వ‌చ్చింద‌న్న రూమ‌ర్ వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news