Yadadri : యాదాద్రిలో ఘనంగా రథసప్తమి వేడుకలు

-

రథ సప్తమి వేడుకను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. స్వామికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో రథసప్తమి వేడుకలు వైభవంగా సాగాయి. వేడుకల్లో భాగంగా ఉదయం స్వామి, అమ్మవార్లను…..వివిధ రకాల పుష్పాలతో అలంకరించి. సూర్యప్రభ వాహనంపై ఆలయ తిరుమాడవీధుల్లో ఊరేగించారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ…. ఆ వాహన సేవ కన్నులపండువగా సాగింది. సాయంత్రం స్వర్ణరథంలో ఆలయతిరుమాడ వీధుల్లో లక్ష్మీసమేత నరసింహుడిని ఊరేగించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news