“దేశముదురు” రీ రిలీజ్ ముహూర్తం ఖరారు.. తగ్గేదేలే !

-

టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయిన సినిమాలను మళ్ళీ రీ రిలీజ్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు నిర్మాతలు. ఇప్పుడు స్టైలిష్ స్టార్ మరియు పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ వంతు వచ్చింది. ఏప్రిల్ నెల 8 వ తేదీన అల్లు అర్జున్ బర్త్డే వస్తున్న సంగతి తెలిసిందే. ఈ శుభసమయాన్ని దృష్టిలో ఉంచుకుని అల్ అర్జున్ మరియు పూరి జగన్నాధ్ కాంబోలో వచ్చిన లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ “దేశముదురు” సినిమాను ఏప్రిల్ 6వ తేదీన థియేటర్ లలో రీ రిలీజ్ చేయనున్నారు.

 

 

ఈ విషయాన్ని DVV ఎంటర్టైన్మెంట్స్ సోషల్ మీడియా ద్వారా తెలియచేయడం విశేషం. దీనితో అభిమానాలు అంతా పుష్ప గా హిట్ కొట్టిన అల్లు అర్జున్ ను యువకుడిగా చూడబోతున్నందుకు ఎంతో సంబరపడిపోతున్నారు. కాగా అల్లు అర్జున్ పుష్ప సినిమా షూటింగ్ తో బిజీ గా ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news