పాతబస్తీ గొడవ వెనుక జరిగింది ఇదే…

-

హైదరాబాద్ పాత బస్తీలో రెండు రోజుల క్రితం జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. రెండు వర్గాలు ఒకరి మీద ఒకరు తీవ్రంగా దాడి చేసుకోవడం ఇద్దరు గాయపడటం జరిగింది. ఈ ఘటనలో పాల్గొన్న నిందితులను అరెస్ట్ చేసి విచారణ చేయగా ఒక విషయం బయటకు వచ్చింది. బండి పార్కింగ్ గురించి రెండు వర్గాలు కొట్టుకున్నాయి అని పోలీసుల విచారణలో వెల్లడైంది.

పాతబస్తీ భవానీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ద్విచక్ర వాహనం ఒక ఇంటి ముందు పార్క్ చేసారు. రెండు మూడు సార్లు వారించినా సరే ఇంటి ముందు వాహనం తీయలేదు. శనివారం మధ్యాహ్నం వాహనాన్ని అక్కడ పార్క్ చేసారు. వాహనాన్ని గమనించిన ఇంటి యజమాని అక్కడ తీయాలని చెప్పినా తీయకుండా వెళ్ళిపోయాడు పార్క్ చేసిన వ్యక్తి. ఇద్దరి మధ్య గొడవ కాగా తర్వాత అది సద్దుమణిగింది.

మళ్ళీ అదే వ్యక్తి అదే బండిని ఇంటి ముందు పార్క్ చేసాడు. దీనితో గొడవకు దిగాడు ఇంటి యజమాని. ఇంటి యజమాని భార్య తన భర్త మీద ఎవరో దాడి చేస్తున్నారని చెప్పడంతో అక్కడికి భారీగా జనం వచ్చేశారు. వారు కూడా ఈ గొడవకు ఆజ్యం పోయడంతో ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు 12 మంది పై కేసులు నమోదు చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news