షియోమీ నుంచి రెడ్‌మీ 9ఎ స్మార్ట్‌ఫోన్‌.. ధ‌ర కేవ‌లం రూ.6799 మాత్ర‌మే..!

-

మొబైల్స్ త‌యారీదారు షియోమీ.. రెడ్‌మీ సిరీస్ లో మ‌రో కొత్త స్మార్ట్ ఫోన్‌ను విడుద‌ల చేసింది. రెడ్‌మీ 9ఎ పేరిట ఆ ఫోన్ భార‌త్‌లో విడుద‌లైంది. షియోమీకి చెందిన లేటెస్ట్ బ‌డ్జెట్ ఫోన్ ఇదే కావ‌డం విశేషం. ఇందులో 6.53 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. మీడియాటెక్ హీలియో జి25 ప్రాసెస‌ర్‌ను అమ‌ర్చారు. 3జీబీ వ‌ర‌కు ర్యామ్‌ను అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ 10 ఓఎస్ ఉంది. వెనుక వైపు 13, ముందు వైపు 5 మెగాపిక్స‌ల్ కెమెరాలు ఉన్నాయి. 5000 ఎంఏహెచ్ భారీ బ్యాట‌రీని ఇందులో అందిస్తున్నారు.

redmi 9a smart phone launched in india

రెడ్‌మీ 9ఎ స్పెసిఫికేష‌న్లు…

* 6.53 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1600 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
* 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి25 ప్రాసెస‌ర్‌, 2/3 జీబీ ర్యామ్
* 32 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డ్యుయల్ సిమ్
* ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌, 13, 5 మెగాపిక్స‌ల్ బ్యాక్‌, ఫ్రంట్ కెమెరాలు
* డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ

రెడ్‌మీ 9ఎ స్మార్ట్ ఫోన్ మిడ్‌నైట్ బ్లాక్‌, సీ బ్లూ, నేచ‌ర్ గ్రీన్ క‌ల‌ర్ వేరియెంట్ల‌లో విడుద‌లైంది. ఈ ఫోన్‌కు చెందిన 2జీబీ ర్యామ్ వేరియెంట్ ధ‌ర రూ.6799 ఉండ‌గా, 3జీబీ ర్యామ్ మోడ‌ల్ ధ‌ర రూ.7499గా ఉంది. సెప్టెంబ‌ర్ 4 నుంచి ఈ ఫోన్‌ను విక్ర‌యిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news