సాయిధరమ్ తేజ్ హెల్త్ బులిటెన్ విడుదల

-

టాలీవుడ్ హీరో, మెగా అల్లుడు సాయి ధరమ్ తేజ్ హెల్త్ బులిటెన్ విడుదల అయింది. కాసేపటి క్రితమే సాయిధరమ్‌ తేజ్‌ హెల్త్ బులిటెన్ ను అపోలో ఆసుపత్రి వైద్యులు విడుదల చేశారు. “హీరో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉంది. క్రమంగా మెరుగుపడుతుంది, హీరో సాయి ధరమ్‌ తేజ్‌ స్పృహలోనే ఉన్నారు. ఆయనకు వెంటి లేటర్‌ ను తొలగించారు. అంతేకాదు… సాయి ధరమ్‌ తేజ్‌ సొంతంగానే శ్వాస తీసుకుంటున్నారు. మరికొన్ని రోజులు ఆయన ఆస్పత్రి లో నే కొనసాగుతారు. .” అంటూ తమ హెల్త్ బులిటెన్ లో అపోలో వైద్యులు పేర్కొన్నారు.

ఈ మేరకు ఓ ప్రకటన కూడా విడుదల చేశారు వైద్యులు. కాగా  సాయి ధరమ్ తేజ్ వినాయక చవితి పర్వ దినాన రోడ్డు ప్రమాదం లో తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 45 నుండి గచ్చిబౌలి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే అతివేగం తో వెళ్ళడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news