ప్రధాని వ్యాఖ్యలపై రేవంత్‌ సీరియస్‌.. మోదీ దిష్టిబొమ్మను దగ్దం చేయాలని పిలుపు

-

ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్దం చేయాలని పిలుపు ఇచ్చారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ…. ఇవాళ కాంగ్రెస్‌ పార్టీ, విభజన పై చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్‌ రెడ్డి. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ వ్యాఖ్యలకు నిరసనగా.. దిష్టిబొమ్మను ఎక్కడికక్కడ దహనం చేయాలని పిలుపు ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాని మోడీ దిష్టి బొమ్మలు దగ్దం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిసిసి పిలుపు ఇచ్చింది. దీంతో ఇవాళ ప్రధాని మోడీ దిష్టి బొమ్మలను కాంగ్రెస్‌ నేతలు దహనం చేయనున్నారు.కాగా.. ఏపీ విభజనపై ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపీ విభజన అంశంపై రాజ్యసభలో ప్రస్తావించారు ప్రధాని మోదీ. రాజకీయ స్వార్థం కోసమే ఏపీని హడావుడిగా విభజించారని అన్నారు.

నేను తెలంగాకు వ్యతిరేఖం కాదని.. అయితే విభజనకు అనుసరించిన పద్దతి సరైందిగా లేదని ఆయన అన్నారు. తెలంగాణ- ఏపీల మధ్య వైషమ్యాలకు కాంగ్రెస్ పార్టీనే కారణం అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఇప్పటికీ సమస్యలను ఎదుర్కొంటున్నాయని ఆయన అన్నారు. కనీసం చర్చ కూడా జరుగకుండా.. విభజన బిల్లును ఆమోదించారని కాంగ్రెస్ పార్టీని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news