ఇవాళ కేటీఆర్‌ ఇలాక సిరిసిల్లాలో రేవంత్‌ రెడ్డి పాదయాత్ర

-

ఇవాళ కేటీఆర్‌ ఇలాక సిరిసిల్లాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయనున్నారు. 20 వ రోజు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర సిరిసిల్లా జిల్లాలో జరుగనుంది. ఇందులో భాగంగానే, ఇవాళ ఉదయం 8 గంటలకు శ్రీపాద 9వ ప్యాకేజ్ సందర్శన ఉండనుంది. ఉదయం 10:30 గంటలకు క్యాంపు వద్ద పవర్ లూమ్ వర్కర్స్, ఆసాముల సంఘం, జఫర్ సంఘాలతో సమావేశం జరుగనుంది.

మధ్యాహ్నం 1 గంటలకు భోజన విరామం ఉండనుంది. సాయంత్రం 4:30 గంటలకు పద్మానగర్ నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుంది. సిరిసిల్ల పట్టణం వరకు కొనసాగనుంది యాత్ర. ఇక ఇవాళ రాత్రి 7 గంటలకు సిరిసిల్ల నేతన్న చౌక్ లో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ జరుగనుంది. అనంతరం… వేములవాడ నియోజకవర్గంలోని రుద్రారం మండలం సంకపల్లిలో రాత్రి బస చేయనున్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news