కెసిఆర్ కి రేవంత్ రెడ్డి విజ్ఞప్తులు…!

-

కెసిఆర్-రేవంత్ రెడ్డి… పచ్చగడ్డి వేయకున్నా సరే ఈ ఇద్దరి మధ్య మండుతూనే ఉంటుంది. రేవంత్ రెడ్డిని అడ్డుకోవాలని కెసిఆర్ కెసిఆర్ ని అడ్డుకోవాలని రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రజా క్షేత్రంలో వీరి మధ్య మాటల యుద్ధం ఏదోక రూపంలో ఉంటుంది. ఇలాంటి వాతావరణం ఇప్పుడు చల్లబడింది. మరి ఏమైందో ఏమో గాని రేవంత్ రెడ్డి కాస్త వెనక్కి తగ్గినట్టే కనపడుతున్నారు.

కరోనా వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఒక విజ్ఞప్తి చేసారు రేవంత్ రెడ్డికి. జైళ్లలో ఉంటున్న ఖైదీలను విడుదల చేయాలని ఆయన కోరారు. జైలు అధికారులు జైళ్లలోకి, బయటికి వస్తుంటారన్న రేవంత్, వారి వల్ల ఖైదీలకు కరోనా సోకే ప్రమాదం పొంచి ఉందన్నారు. అందువల్ల ఖైదీల విడుదల ఆలోచన చేయాలని కోరారు. ముఖ్యంగా, మహిళలు, వృద్ధుల పట్ల సానుకూలంగా స్పందించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితులను అర్థం చేసుకొని, సరైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో మొత్తం 5 లక్షల మంది ఖైదీలు ఉన్నారన్న రేవంత్… అందులో 65 శాతం మంది ట్రయల్స్‌లో ఉన్నవారేనని చెప్పారు. శిక్ష కాలం ముగుస్తున్న వారిని, పెట్టీ కేసుల్లో అరెస్టయి జైల్లో ఉన్నవారిని విడుదల చేసే దిశగా చర్యలు తీసుకోవాలని తన లేఖలో రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news