ప్రమాణ స్వీకారం తర్వాత కేసీఆర్‌పై దండయాత్రే ; రేవంత్ రెడ్డి

-

పీసీసీగా ప్రమాణ స్వీకారం తర్వాత… సీఎం కేసీఆర్ పై దండయాత్ర చేస్తామని..అది ఖమ్మం నుంచే ప్రారంభమౌతుందని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచి అమ్ముడుపొయిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపాలని… అలా కొట్టడంలో తాను ముందుంటానని ఫైర్‌ అయ్యారు.

కార్యకర్తలు కష్టపడి గెలిపిస్తే అధికార పార్టీకి అమ్ముడుపోయే సన్నాసులకు సిగ్గు ఉండాలని.. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యే లపై చర్యలు తీసుకోకుంటే… అవసరమైతే స్పీకర్ పై చర్యలకు కూడా న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు.

Kcr పశువులను కొన్నట్లుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొన్నాడని…అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు పదవికి రాజీనామ చేసి దమ్ముంటే ఎన్నికలకు రావాలని సవాల్‌ విసిరారు. తెలంగాణ ఇచ్చింది సొనియా…. ప్రజలకు సొనియాపై నమ్మకం ఉందని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు నమ్మకం ఉందని..వచ్చే ఎన్నికల్లో కెసిఆర్ కి ప్రజలు మంచి గుణపాఠం చెప్తారని చురకలు అంటించారు

Read more RELATED
Recommended to you

Latest news