టిఆర్ఎస్ ప్లెక్సీలో రేవంత్ రెడ్డి ఫోటో.. ఆందోళనకు దిగిన కాంగ్రెస్ నాయకులు

-

మేడ్చల్ మండలం ఎల్లంపేట గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొనేందుకు మంత్రి మల్లారెడ్డి తో పాటు అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కాంగ్రెస్ లీడర్, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఫోటో పెట్టారు. ఆయన ప్రతిపక్ష పార్టీ నాయకుడు అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్న విషయం తెలిసిందే.

టిఆర్ఎస్ పార్టీ బ్యానర్లలో రేవంత్ ఫోటో కనిపించి కనిపించకుండా ఓ చోట ముద్రించారు.దీనిపై కాంగ్రెస్ నాయకులు మంత్రి మల్లారెడ్డిని నిలదీశారు.టిఆర్ఎస్ ప్లెక్సీలో రేవంత్ రెడ్డి ఫోటో వేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ పాటించాలని డిమాండ్ చేశారు.దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ వారిని అదుపులోకి తీసుకోవడంతో గొడవ సద్దుమణిగింది.

Read more RELATED
Recommended to you

Latest news