“అంటే సుందరానికి” బిగ్‌ షాక్‌..188 సెక్షన్ కేసు చేసిన పోలీసులు

-

నాని హీరోగా నటించిన “అంటే సుందరానికి” సినిమాకు బిగ్‌ షాక్‌ ఇచ్చింది. ఈ సినిమా నిర్మాణ బృందంపై 188 సెక్షన్ కేసు చేసారు పోలీసులు. మైత్రీ మూవీస్ , శ్రేయాస్ మీడియా ఫై మాదాపూర్ పీఎస్ లో కేసు నమోదు చేశారు. మాదాపూర్ శిల్పకళా వేదికలో అంటే సుందరానికి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే.

అయితే.. అనుమతి లేకుండానే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ నున నిర్వహించింది శ్రేయాస్ మీడియా. పోలీసుల అనుమతి లేకుండా పవన్ కళ్యాణ్ లాంటి వీఐపీ వచ్చిన పోలీసులకు సమాచారం లేకుండా ఈవెంట్ చేశారు శ్రేయాస్ మీడియా సురేష్. ఈ నేపథ్యంలోనే.. సురేష్ తో పాటు మైత్రి మూవీస్ ఫై 188 సెక్షన్ ఫై కేసు నమోదు చేశారు మాదాపూర్‌ పోలీసులు. అయితే.. ఈ కేసుపై మైత్రీ మూవీస్ , శ్రేయాస్ మీడియా ఇంకా స్పందించలేదు. కాగా.. నిన్న రిలీజ్‌ అయిన “అంటే సుందరానికి” సినిమా విజయవంతంగా థియేటర్లలో కొనసాగుతోంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news