తెలంగాణ మంత్రి ఎర్రబెల్లికి ఆర్జివి వార్నింగ్.. జై తెలంగాణ అంటూ !

-

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ… ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాంగోపాల్ వర్మ ఏది చేసినా సంచలనమే… వెండితెరపై సినిమా తీసినా.. ఓ టి టి లో వెబ్ సిరీస్ రూపొందించిన ఆయన స్టైల్ వేరు. ఇక బయోపిక్ సినిమాల నిర్మాణం లో రాంగోపాల్ వర్మ టేకింగ్ గురించి… స్పెషల్ గా చెప్పే పనే లేదు. రాయలసీమ ఫ్యాక్షనిజం మీద వర్మ తీసిన రక్తచరిత్ర సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో తెలిసిందే.

ఇప్పుడు వర్మ ఫోకస్ తెలంగాణ పై పడింది. ప్రస్తుతం కొండా మురళి మరియు కొండా సురేఖల బయోపిక్ చేస్తున్నారు రాంగోపాల్ వర్మ. ఈ సినిమాకు “కొండా” అనే టైటిల్ కూడా పెట్టేసాడు రాంగోపాల్ వర్మ. ఇక ఇటీవల ఈ సినిమా షూటింగ్ కోసం వరంగల్ లో ఈ చిత్ర బృందం పర్యటించింది. అయితే ఈ సినిమా నేపథ్యంలో తాజాగా రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్ చేశాడు.

“అరచేతిని అడ్డుపెట్టి సూర్య కాంతి ని ఆపలేరని ఆనాటి కార్ల్ మార్క్స్ తెలుసుకున్నట్టే, పిచ్చిపిచ్చి ప్రయత్నాలతో కొండా సినిమా షూటింగ్ ఆపలేరని నల్ల బల్లి సుధాకర్ తెలుసుకోవాలి…జై తెలంగాణ” అంటూ ఓ వివాదాస్పద ట్వీట్ చేశారు వర్మ. అయితే ఈ నల్లబల్లి సుధాకర్… ఎవరు అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. అంతేకాదు వర్మ ట్వీట్ పై నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

అయితే ఎర్రబెల్లి దయాకర్ రావు కు నల్లబెల్లి సుధాకర్ పేరుతో వర్మ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం అందుతోంది. ఎర్రబెల్లి దయాకర్ రావు నుంచి ఈ సినిమా తీయడం పై రాంగోపాల్ వర్మ కు బెదిరింపులు వచ్చాయని తెలుస్తోంది. ఈ తరుణంలోనే రాంగోపాల్ వర్మ ట్వీట్ చేసి ఉంటాడని అందరు అనుకుంటున్నారు. మొత్తానికి రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news