సుశాంత్ డెత్ కేసు: ఈడీ ఆఫీసుకి రియా…!

-

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం విషయంలో ఇప్పుడు దర్యాప్తు సంస్థలు వేగం పెంచాయి. సిబిఐ సహా ఈడీ ఈ కేసు విషయంలో ఇప్పుడు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. కేసు విచారణకు సంబంధించి తాజాగా సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని ఈడీ విచారిస్తుంది. ఈ కేసు విచారణకు గానూ ఆమె ముంబైలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) కార్యాలయానికి వచ్చారు.

ఆమె స్టేట్మెంట్ రికార్డింగ్ విషయంలో సుప్రీంకోర్టు విచారణ వరకు వాయిదా వేయాలని ఆమె కోరగా దాన్ని ఈడీ తిరస్కరించింది. ఇక ఈ కేసుకి సంబంధించి త్వరలోనే మరి కొన్ని అరెస్ట్ లు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. ఇప్పటికే కొందరి స్టేట్మెంట్లు రికార్డ్ చేసారు. సిబిఐ కూడా ఈ కేసు విచారణలో చాలా వరకు దూకుడుగా ఉంది. సిబిఐ కి కేంద్రం కేసు అప్పగించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news