నా జీవితంలో చేసిన పెద్ద తప్పు సుశాంత్ ను ప్రేమించడమే : రియా

-

బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కొన్ని నెలల క్రితం మృతి చెందిన సంగతి తెలిసిందే. సుశాంత్ మృతి గురించి ప్రజల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. సీబీఐ విచారణలో సుశాంత్ గురించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సుశాంత్ డ్రగ్స్ తీసుకునేవాడని అధికారులు తేల్చారు. సుశాంత్ తండ్రి కేకే సింగ్ తాజాగా ఆమె గురించి సంచలన ఆరోపణలు చేశారు. సుశాంత్ కు రియా విషం ఇచ్చి చంపేసిందని అన్నారు.

ఈడీ అధికారుల విచారణలో రియాకు డ్రగ్ డీలర్లతో సంబంధం ఉన్నట్టు తేలింది. డ్రగ్స్ స్కామ్ దిశగా కూడా అధికారుల విచారణ జరుగుతోంది. అయితే తాజాగా రియా చక్రవర్తి ఒక న్యూస్ పోర్టల్ తో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై వెబ్ మీడియా, న్యూస్ ఛానెళ్లలో వైరల్ అవుతున్న వార్తల గురించి ఆమె స్పందించారు. తనను ఎవరు విచారించినా ఎటువంటి సమస్య లేదని సుశాంత్ ను ప్రేమించడమే తాను జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు అని అన్నారు.

తాను అబద్ధాలు చెప్పడం లేదని… సుశాంత్ విషయంలో ఎటువంటి నిజాలను దాచడం లేదని ఆమె అన్నారు. సుశాంత్ జూన్ 14వ తేదీన మృతి చెందగా జూన్ 8వ తేదీన సుశాంత్ రియాల మధ్య వివాదం చోటు చేసుకుంది. అదే సమయంలో సుశాంత్ ఇంట్లో 8 హార్డ్ డిస్క్ లు ధ్వంసమయ్యాయని తెలుస్తోంది. సీబీఐ అధికారులు సుశాంత్ స్నేహితుడు సిద్ధార్థ పితాని, వంట‌మ‌నిషి, ప‌నిమ‌నుషుల‌ను ఈ కేసు విషయంలో విచారించారు.

Read more RELATED
Recommended to you

Latest news