అయ్యబాబోయ్: రాజస్థాన్ కోచ్… మళ్లీ రియాన్ పరాగ్ కు ఛాన్స్ ఇచ్చాడుగా!

-

రాజస్థాన్ మరియు లక్నో ల మధ్యన జైపూర్ లో మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. మొదట బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ లక్నో ఓపెనర్ల పైన ఒత్తిడిని పెంచుతున్నాడు. ఈ పిచ్ పైన పరుగులు తీయడం కూడా చాలా కష్టంగా మారుతోంది. కాగా ఈ రోజు రాజస్థాన్ తుది జట్టుపై అప్పుడే విమర్శలు వినబడుతున్నాయి. ఈ మ్యాచ్ లో జంపకు బదులుగా ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్ జట్టులోకి రాగా, గత మ్యాచ్ లో ఆడిన జట్టునే కొనసాగించడం విశేషం. అయితే ఈ మ్యాచ్ లో యంగ్ ప్లేయర్ రియాన్ పరాగ్ ను తీసుకోవడం పట్ల కొందరు రాజస్థాన్ కోచ్ ను విమర్శిస్తున్నారు.

ఈ ఐపీఎల్ లో ఇప్పటి వరకు అసలు ఏమీ ప్రదర్శన చేయలేదు. కానీ ఎందుకు ఇతని మ్యాచ్ లకు తీసుకుంటోంది అంటూ కామెంట్ చేస్తున్నారు. తనపై ఎందుకు ఇంత నమ్మకం పెట్టుకుంటోందో వారికే తెలియాలి అంటూ మాట్లాడుతున్నారు. మరి రియాన్ పరాగ్ కనీసం ఈ మ్యాచ్ లో అయినా రాణిస్తాడా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news