అమెరికాలో రోడ్ ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తెలుగు వారు మృతి

-

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నారాయణపేట జిల్లా మరికల్ మండలం పెద్దచింతకుంట గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారు అమెరికాలోని టెక్సాస్ నగరంలో  రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.  టెక్సాస్ లో రోడ్డు ప్రమాదంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. యాక్సిడెంట్ లో మరికల్ మండలం పెద్ద చింతకుంటకు చెందిన నరసింహ రెడ్డి , దంపతులతో పాటు కుమారుడు భరత్ మృతి చెందగా కూతురు మౌనిక పరిస్థితి విషమంగా ఉంది.

కూతురు మౌనికకు పెళ్లి సంబంధం చూసేందుకు అమెరికా వెళ్లారు నరసింహ రెడ్డి దంపతులు. అయితే కోవిడ్ కారణంగా వీసా జారీలో జాప్యం కావడంతో అక్కడ నరసింహ రెడ్డి దంపతులు ఉండిపోయినట్లు చెబుతున్నారు. అయితే వీరు ఒక స్టేట్ నుండి మరో స్టేట్ వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. అందుతున్న సమాచారం మేరకు చింతకుంటకు చెందిన నరసింహ రెడ్డి తెలంగాణా ఆర్టీసీలో కండక్టర్ గా పని చేస్తున్నట్లు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news