ASIA CUP : టీ20ల్లో ప్రపంచ రికార్డు సృష్టించిన రోహిత్‌ శర్మ..

-

ఆసియా కప్ 2022 లో భారత జోరుకు బ్రేక్ పడింది. పాకిస్తాన్ తో ఆదివారం జరిగిన సూపర్ 4 మ్యాచ్ లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్ లో అనవసర తప్పిదాలతో టీమిండియా ఓటమిపాలైంది. అయితే.. ఈ మ్యాచ్‌ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టి20లో సరికొత్త చరిత్ర సృష్టించాడు.

టి20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. ఆసియా కప్ 2022 లో భాగంగా పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో 28 పరుగులు చేసిన రోహిత్, ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా ఇప్పటివరకు ఈ రికార్డు న్యూజిలాండ్ బ్యాటర్ సుజి బెట్స్ పేరిట ఉండేది. అయితే తాజా మ్యాచ్ తో రోహిత్ శర్మ ఈ రికార్డును తన పేరిట లికించుకున్నాడు. తన టీ 20 కెరీర్ లో ఇప్పటివరకు 127 మ్యాచ్ లు ఆడిన హిట్ మ్యాన్ 3548 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్ లలో 27 హాఫ్ సెంచరీలతో పాటు 4 సెంచరీలు కూడా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news