ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో దేశవ్యాప్తంగా సోదాలు.. హైదరాబాద్ లో 6 చోట్ల !

-

ఢిల్లీతోపాటు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు లేపిన లిక్కర్ స్కాం లో ఈడి దూకుడు పెంచింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడి దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా నేడు ( మంగళవారం) ఉదయం నుండే దేశవ్యాప్తంగా 30 చోట్ల ఈడి సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీ, లక్నో, గురుగావ్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్ లో ఆరు చోట్ల ఈడి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

రామచంద్రన్ కి సంబంధించిన కంపెనీతో పాటు ఇంటిలో సోదాలు నిర్వహిస్తున్నారు ఈడీ అధికారులు. ఇప్పటికే ఈ కేసులో పక్కా ఆధారాలు సేకరించింది సిబిఐ. ఈ కేసులో a1 నిందితుడిగా ఉన్న ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బ్యాంక్ లావాదేవీలపై ఫోకస్ చేసింది. సిసోడియ బ్యాంకు లాకర్లను తెరిచారు సిబిఐ అధికారులు. ఘజియాబాద్ లోని పంజాబ్ నేషనల్ బ్యాంకులో మనిష్ సిసోడియా లావాదేవీలను పరిశీలించారు. తాజాగా దేశవ్యాప్తంగా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news