హార్దిక్ కెప్టెన్సీలో ఆడటం రోహిత్ శర్మకు ఇష్టమే: మాజీ క్రికెటర్ శ్రీశాంత్

-

ట్రేడింగ్ ఆప్షన్ ద్వారా గుజరాత్ టైటాన్స్ నుండి హార్థిక్ పాండ్యని ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే హర్డిక్ పాండ్య ని కెప్టెన్గా ప్రకటించిన ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ…. ఇప్పటివరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా నెగ్గలేకపోయింది. ఇక ఈ నిర్ణయం పై రోజు రోజుకి అభిమానుల నుండి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ముంబై తీసుకున్న ఈ నిర్ణయంపై ఒక్కో అభిమాని ఒక్కో తీరుగా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ముంబై జట్టును రోహిత్ శర్మ గతంలో ముందుండి నడిపించారని, ఇప్పుడు వెనకాల ఉండి నడిపిస్తారని శ్రీశాంత్ అన్నారు. ‘మార్పును అంగీకరించేందుకు మనం సిద్ధంగా ఉండాలి. హార్దిక్ కెప్టెన్సీలో ఆడేందుకు రోహిత్ శర్మ ఇష్టపడతారు అని అన్నారు. గతంలో ధోనీ కెప్టెన్సీలో సచిన్ కూడా ఆడారు. ఆ సమయంలో వరల్డ్ కప్ కూడా గెలిచారు అని గుర్తు చేశారు. కెప్టెన్సీ లేకపోవడంతో రోహిత్ స్వేచ్ఛగా ఆడి ఆరెంజ్ క్యాప్ రేసులో ఉంటారు’ అని శ్రీశాంత్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news