చంద్రబాబు కు సవాల్ విసిరిన ఎమ్మెల్యే రోజా..!

-

ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో వికేంద్రీకరణ బిల్లుకు సంబంధించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలపటంతో ఆంధ్ర రాజకీయాలు మరోసారి భగ్గుమన్నాయి. గవర్నర్ నిర్ణయాన్ని టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో ఖండిస్తున్నారు. గవర్నర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక టీడీపీ నేతలు కొందరు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో దీనిపై స్పందిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు… టీడీపీ అధినేత చంద్రబాబు సహా టిడిపి నేతలు అందరికీ సవాల్ విసురుతున్నారు.

మంత్రి కొడాలి నాని అందరితో రాజీనామా చేయించి గెలవాలి అంటు చంద్రబాబు కు సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఇక తాజాగా వైసీపీ ఎమ్మెల్యే రోజా టిడిపికి ఇలాంటి ఓ సవాల్ విసిరారు. 23 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి మరో సారి అందరూ గెలిస్తే… అమరావతి నే ప్రజలు రాజధానిగా కోరుకుంటున్నారు అంటు అమ్ముతామని అంతేకాకుండా వికేంద్రీకరణ పై మరోసారి పునరాలోచిస్తామని అంటూ సవాల్ విసిరారు ఎమ్మెల్యే రోజా.

Read more RELATED
Recommended to you

Latest news