తన కూతురు సినిమాల్లోకి రావడం పై మంత్రి రోజా క్లారిటీ

-

ఇవాళ తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి రోజా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ… ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో రాజకీయంగా ఉన్నతమైన స్థానానికి చేరాను అన్నారు. కార్తీక మాసంలో స్వామివారిని దర్శించుకున్నానని, శ్రీవారిని ఎన్నిసార్లు చూసినా సంతోషంగా ఉంటుంది అన్నారు. తాను అన్నమయ్య సినిమాలో నటించడం చాలా సంతోషంగా ఉంది అని గుర్తు చేసుకున్నారు.

‘స్వామిని చూడగానే మనం కూడా దేవుడి కుటుంబ సభ్యులుగా ఓ ఫీలింగ్, తిరుపతి చుట్టుపక్కల వారికి మా స్వామి అని ఫీలింగ్ ఉంటుంది’ అన్నారు. శత్రువులను ఎదుర్కొనే శక్తిని ఇవ్వమని స్వామి వారిని కోరుకున్నానని చెప్పారు. తనకు ఆరోగ్యం ప్రసాదించమని స్వామి వారిని కోరినట్లు తెలిపారు. తన కుమార్తె, కుమారుడు నటించాలని కోరుకుంటే తప్పకుండా అండగా ఉంటాను అన్నారు రోజా. తన కుమార్తెకు చదువు పైన శ్రద్ధ ఎక్కువగా ఉందని, సైంటిస్ట్ కావాలనే ఆలోచన ఉంది. ఇప్పటికైతే సినిమాల్లోకి వచ్చే ఆలోచన లేదు. ఓ తల్లిగా, నటిగా ఆమెకు అండగా ఉంటాను అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news