డాక్టర్ పరీక్ష రాసినా ఫిధా పోరి..!

-

సాయిపల్లవి.. పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. తన నటనతో ప్రేక్షకులను ఫిధా చేసిన ఈ ముద్దుగుమ్మ జార్జియాలో మెడిసిన్ చదివిన విషయం అందరికి తెలిసిందే. మెడిసిన్‌పై ఉన్న కోరికతో విదేశాలకు వెళ్లి అక్కడ చదువుకుంది. అయితే విదేశాల్లో మెడిసిన్‌ చేసిన ఎవరైనా సరే ఇండియాలో డాక్టర్‌గా గుర్తింపు పొందాలంటే మెడికల్‌ కౌన్సిల్‌ నిర్వహించే పరీక్ష రాయాల్సి ఉంటుంది. అయితే కరోనా కారణంగా భారత్ లో పరీక్షలన్నీ అనుకున్న సమయానికి జరగలేదు. ఇప్పుడు అన్ లాక్ 4.0 గైడ్ లైన్స్ తో పరీక్షలు ప్రారంభమయ్యాయి.

ఇందులో భాగంగానే మెడికల్‌ కౌన్సిల్‌ నిర్వహించే పరీక్ష కూడా చాలా ఆలస్యంగా జరిగింది. దీంతో సాయి పల్లవి ఆ పరీక్షకు హాజరైంది. ఇందుకోసం సాయి పల్లవి కేరళలోని తిరుచ్చికి చేరుకుంది. అయితే పరీక్ష కేంద్రంలో సాయి పల్లవిని చూసి అందరు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆమెతో ఫోటోలు దిగేందుకు అందరు ఎగపడ్డారు. మాస్క్ లో వచ్చినా అందరు తనను గుర్తు పట్టడంతో ఇక చేసేదేమి లేక అందరితో కలిసి ఫోటోలకు ఫోజు ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news