ఆదిపురుష్ అప్డేట్..షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న లంకేష్..!

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాలీవుడ్ భామ కృతి శెట్టి జంటగా నటిస్తున్న సినిమా ఆది పురుష్. పౌరాణిక రామాయణం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో రవనుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సైఫ్ అలీ ఖాన్ తన షూటింగ్ పూర్తి చేసినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర బృందం సమక్షంలో సైఫ్ అలీ ఖాన్ తో కేక్ కట్ చేపించి వీడ్కోలు పలికారు.ఇక పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. బాహుబలి సినిమా తో ప్రభాస్ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోగా ఈ సారి రాముడి పాత్రలో ప్రభాస్ అలరించనున్నారు. దాంతో ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ప్రేక్షకులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో కృతిసనన్ సీత పాత్రలో కనిపించబోతోంది. ఎన్నో అంచనాల మధ్యతరగతి సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news