చంద్రబాబు నిజస్వరూపం మరోసారి బయటపడింది – సజ్జల

-

మాచర్లలో ఇటీవల జరిగిన ఘర్షణలలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు నిజస్వరూపం మరోసారి బయటపడింది అన్నారు ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. మాచర్లను చంద్రబాబు అగ్నిగుండం చేయాలని ప్రయత్నించారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతలు అదుపులో లేవని టిడిపి నేతలు నిరూపించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలు అజ్ఞానంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మర్డర్లు చేసిన బ్రహ్మ రెడ్డి ని మాచర్లకు ఎందుకు తీసుకువచ్చారని.. వాళ్లే అటాక్ చేసి శాంతిభద్రతలు లేవు అని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైసిపి గెలవదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కూడా సజ్జల స్పందించారు. జగన్ అధికారంలోకి రాకుండా ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఏజెంట్ గా మాట్లాడుతున్నారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news