రాయలసీమ నీళ్ల సమస్యకు అసలు విలన్ చంద్రబాబే : సజ్జల

-

అమరావతి : ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మరోసారి టిడిపి అధినేత చంద్రబాబు పై విరుచుకుపడ్డారు. రాయలసీమ నీళ్ల సమస్యకు ప్రధాన కారకుడు చంద్రబాబు అని.. విలన్ ను పక్కన పెట్టుకుని ఢిల్లీ వెళితే ప్రజలు సహించబోరని ఫైర్ అయ్యారు. అనుమతులు లేకుండా పాలమూరు-రంగారెడ్డి, దిండి ప్రాజెక్టులను కడుతున్నప్పుడు చంద్రబాబు ఎందుకు అడ్డుకోలేదు ? అని ప్రశ్నించారు.

అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ దీక్ష చేశారని.. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఘోరంగా విఫలమయ్యారని మండిపడ్డారు సజ్జల. ప్రజలకు సంజాయిషీ ఇచ్చే పరిస్థితిలో ఉన్నది చంద్రబాబు అని.. ఏ కేసులకు భయపడి కేసీఆర్ కు వ్యతిరేకంగా నోరు విప్పలేదో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు సజ్జల. చంద్రబాబుది ఎప్పుడు.. మోసం చేసే ధోరణి అని మండిపడ్డారు. కాగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఒకరి మరోకరు ఆరోపణలు చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news