సకల జనుల సమ్మెలో ఆర్టీసీ ఉద్యోగులు కీలక భూమిక పోషించారు : సజ్జనార్‌

-

తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగులు పోషించిన పాత్ర చరిత్రలో నిలిచిపోయిందని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలో పాల్గొని బస్సు చక్రాలను ఆపడం వల్లే సకల జనుల సమ్మె ఉధృతమైందని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులు అనేక ఉద్యమాలు, నిరసన కార్యక్రమాల్లో పాల్గొని తమ పోరాట స్ఫూర్తిని చూపించారని వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర చరిత్రలో నిలిచిపోయిందన్నారు. తమ జీవితాలను, ఉద్యోగాలను సైతం లెక్క చేయకుండా ప్రత్యేక తెలంగాణ కోసం ఆర్టీసీ ఉద్యోగులు పోరాడారని చెప్పారు.

Sajjanar | తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీది కీలక పాత్ర : సజ్జనార్‌-Namasthe  Telangana

హైదరాబాద్‌లోని బస్‌భవన్‌ ప్రాంగణంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో వీసీ సజ్జనార్‌ పాల్గొన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు 29 రోజుల పాటు సకల జనుల సమ్మెను కొనసాగించారని.. 56,604 మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొని స్వరాష్ట్ర సాధనకు నిర్విరామంగా కృషిచేశారని గుర్తు చేశారు. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలో పాల్గొని బ‌స్సు చ‌క్రాల‌ను ఆప‌డం వ‌ల్లే సకల జనుల సమ్మె ఉదృతమైందని.. విజయవంతం కూడా అయిందని అన్నారు. అనేక ఉద్యమాలు, నిరసన కార్యక్రమాల్లో పాల్గొని తమ పోరాట స్ఫూర్తిని చూపార‌ని కొనియాడారు. వివిధ రూపాల్లో ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎంతో మందిని ఉద్యోగులు చైతన్యపరిచార‌ని గుర్తు చేశారు. కొంద‌రు ఉద్యోగులు త‌మ పాటలు, ర‌చ‌న‌లు, నాట‌కాల ద్వారా ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారని చెప్పారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news